
భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద ఆ మహనీయుని విగ్రహానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారి వెంట ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రులు దామోదర రాజనర్సింహ గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారు, పలువురు నేతలు పాల్గొని బాబాసాహెబ్ గారి సామాజిక సమానత్వ సందేశాన్ని స్మరించుకుంటూ శ్రద్ధాంజలి ఘటించారు.
