
ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందానికి జపాన్ లో ఘన స్వాగతం లభించించి. టోక్యోలోని 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఇండియా హౌస్లో జపాన్లోని భారత రాయబారి శిబు జార్జ్ గారు తెలంగాణ ప్రతినిధి బృందాన్ని స్వాగతించి, వారికి ఘనంగా విందు ఇచ్చారు. జపాన్ లోని భారత రాయబారి గారితో ముఖ్యమంత్రి గారు సమకాలీన అంశాలపై చర్చలు జరిపారు.
ఈ కార్యక్రమంలో డిఎంకె ఎంపీ శ్రీమతి కనిమొళి కరుణానిధి గారు, నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి గారు, మాజీ ఎంపీ నెపోలియన్ గారు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

