
రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్భవన్లో గవర్నర్ గారిని కలిసి ముఖ్యమంత్రి గారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ గారు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు.